పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్ | Indian Army Chief Dalbir Singh Suhag warns Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

Aug 1 2014 10:50 AM | Updated on Sep 2 2017 11:14 AM

పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

పాకిస్థాన్ కు భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గట్టి హెచ్చరిక జారీచేశారు.

న్యూఢిల్లీ: పాకిస్థాన్ కు భారత సైనికదళాల కొత్త ప్రధానాధికారి జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ గట్టి హెచ్చరిక జారీచేశారు. తమ సైనికులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. తగినరీతిలో జవాబు చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. సైనికుల తలలు తీయడం లాంటి ఘటనలు జరిగితే అవసరమైనదానికంటే ఎక్కువగా, వేగంగా, ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు.

పదవి చేపట్టి 24 గంటలు గడవక ముందే ఆయనీ హెచ్చరికలు చేయడం విశేషం. 26వ ఆర్మీ చీఫ్‌గా గురువారం సుహాగ్ బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు భారత సైనికుల తలలు నరికివేసిన ఘటనపై తగిన రీతిలోనే స్పందించామని మాజీ ఆర్మీ చీఫ్‌ జనరల్ బ్రికమ్ సింగ్ సమర్థించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement