‘ఈ-కేటరింగ్’ షురూ | 'E-catering' started | Sakshi
Sakshi News home page

‘ఈ-కేటరింగ్’ షురూ

Oct 20 2015 4:59 AM | Updated on Sep 3 2017 11:12 AM

‘ఈ-కేటరింగ్’ షురూ

‘ఈ-కేటరింగ్’ షురూ

ముందస్తు ఆర్డర్లపై ప్రయాణికులకు రైల్వేస్టేషన్లలోనే వారికి కావల్సిన ఆహారాన్ని అందజేసేందుకు ఇండియన్ రైల్వేస్ కేటరింగ్, టూరిజం

ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
 
 కోల్‌కతా: ముందస్తు ఆర్డర్లపై ప్రయాణికులకు రైల్వేస్టేషన్లలోనే వారికి కావల్సిన ఆహారాన్ని అందజేసేందుకు  ఇండియన్ రైల్వేస్ కేటరింగ్, టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) సోమవారం ఓ పథకాన్ని ప్రారంభించింది. ‘ఈ-కేటరింగ్’ పేరిట దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తొలిదశలో దేశవ్యాప్తంగా ఎంపికచేసిన 45 ప్రధాన  రైల్వేస్టేషన్లలో అమలు చేయనున్నారు. దీనికోసం ప్రయాణికులకు కావల్సిన ఆహారాన్ని అందించేందుకు భోజన సరఫరా సంస్థలతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని ‘స్టేషన్ ఆధారిత ఈ-కేటరింగ్’గా వ్యవహరిస్తారు. దీనికోసం ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే www.ecatering.irctc.co.in ద్వారా బుక్‌చేసుకోవచ్చు.

లేదా 0120-2383892-99/1800-1034-139 (టోల్ ఫ్రీ) నెంబర్లకు ఫోన్‌చేసి ఆర్డర్ చేయవచ్చు. లేదా 139 నెంబరుకు సంక్షిప్త సందేశం పంపి భోజన సదుపాయాన్ని పొందవచ్చు. అయితే సంస్థలు ఈ ఆహారాన్ని ప్రయాణికులకు సంబంధిత స్టేషన్లలో రైలు ఆగినప్పుడు ప్రయాణికుని బెర్త్ వద్దకు వచ్చి అందజేస్తాయి. చెల్లింపులను నేరుగానే కాకుండా, ఆన్‌లైన్లోనూ చేయొచ్చు. ఈ-కేటరింగ్ ఈస్ట్‌జోన్ పరిధిలోని హౌరా, సీల్దా, విశాఖపట్నం తదితర  స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ, చెన్నయ్, బెంగళూరు, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ తదితర ప్రధాన స్టేషన్లలో కూడా సరఫరా చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement