
ప్రతిష్టంభనకు కాంగ్రెస్ కారణం: సుష్మ
లోక్సభలో నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని సుష్మాస్వరాజ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ : లోక్సభలో నెలకొన్న ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని సుష్మాస్వరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ హైకమాండ్ తప్పుడు ప్రక్రియలో తెలంగాణ అంశాన్ని చేపట్టిందని ఆమె ఆరోపించారు. తమ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినా అక్కడ ఎలాంటి గొడవలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రెండు ప్రాంతాల్లో సద్భావన మాత్రం దెబ్బతినలేదన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్లే పార్లమెంట్ నడవని దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. సభ సజావుగా సాగేలా కేంద్ర చొరవ తీసుకోవాలని సుష్మాస్వరాజ్ కోరారు.
మరోవైపు 11మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. అయితే సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్పై హైడ్రామా కొనసాగుతోంది. బీజేపీతో పాటు పాటు పలు పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేయటంతో కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. అఖిలపక్షంతో సంప్రదించి ఓ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ భావిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్నాథ్ తెలిపారు.