-ముగిసిన కిష్టయ్య ప్రస్థానం...
-ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్లో హతం
-ఆర్ఎస్యూ నుంచి కేంద్ర కమిటీ దాకా..
-రెండు దశాబ్దాలకు పైగా ఉద్యమ జీవనం
-సాంబశివుడికి, నయీమ్కు ఇతడే గురువు..!
యాదాద్రి: మిలిటెంట్గా ఉద్యమాన్ని ప్రారంభించి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన చామల కిష్టయ్య అలియాస్ దయా 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో జరిగిన ఎన్కౌంటర్తో ముగిసింది. జిల్లాలో ఎందరినో ఉద్యమబాట పట్టించిన కిష్టయ్య అంచలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక మధిర గ్రామమైన దాసిరెడ్డిగూడేనికి చెందిన చామల చంద్రమ్మ, రామయ్యల ఆరవ సంతానం కిష్టయ్య. విద్యార్థి దశలోనే పీపుల్స్వార్ ఉద్యమంలోకి వెళ్లాడు.
భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో బీకాం చదువుతూ 1990లో ఆర్ఎస్యూ వైపు ఆకర్షితుడయ్యాడు. ఆలేరు, కృష్ణపట్టె దళాల్లో మిలిటెంట్గా పని చేస్తూ ఈ ప్రాంతం నుంచి ఎందరినో ఉద్యమంలోకి తీసుకెళ్లాడు. వలిగొండ, భువనగిరి, ఆలేరుతో పాటు జిల్లాలోని పలువురిని ఉద్యమ బాట పట్టించాడు. హైదరాబాద్లో పీపుల్స్వార్ ప్రచార దళాల్లో పని చేస్తూ ఉద్యమంలోకి పూర్తి స్థాయిగా వెళ్లాడు. పోలీసులు పలుమార్లు వచ్చి మీకుమారుడిని ఉద్యమంలోంచి బయటకు రమ్మని కోరమంటూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తులు కిష్టయ్య లెక్క చేయలేదు. తనకంటే పెద్దవారైన ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు, తల్లిదండ్రులు ఉన్నా ఏనాడు ఇంటి వైపే చూడలేదు.
అతనో నాయకుడు
పీపుల్స్వార్ ఉద్యమంలో రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన సాంబశివుడు, గ్యాంగ్స్టర్గా మారిన నయీమ్తో పాటు మరెందరినో పార్టీలో చేర్పించాడు. ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో చదువుతుండగా అదే కాలేజీలో విద్యనభ్యసిస్తున్న భువనగిరికి చెందిన నయీమ్ను పీపుల్స్వార్లో చేర్పించాడు. అలాగే అతడి స్వగ్రామమైన దాసిరెడ్డిగూడెంలో సాంబశివుడు, అతడి సోదరుడు కొనపురి రాములు, రాపోలు స్వామిని ఉద్యమ బాట పట్టించాడు. ఒక విధంగా వలిగొండలో పీపుల్స్వార్కు ఎందరో ముఖ్య కార్యకర్తలను, నాయకులను, సానుభూతిపరులను తయారు చేసిన నాయకుడని కిష్టయ్య గురించి తెలిసినవారు చెబుతారు.
26 ఏళ్లుగా ఇంటి ముఖం చూడకుండా..
పీపుల్స్వార్లోకి వెళ్లిన కిష్టయ్య తన 26 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఒక్క రోజు కూడా ఇంటిముఖం చూడలేదు. నిరుపేదలైన అతడి తలిదండ్రులు అవస్థలు పడుతున్నా వారిని పట్టించుకోలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు తమ కొడుకు ఎలా ఉంటాడోనని తల్లి చంద్రమ్మ అప్పుడప్పుడు ఆవేదన చెందుతుండేది. గ్రామస్తులు సైతం కిష్టయ్య పేరు తప్పా ఆయన ఉనికి తెలియని పరిస్థితి.
2008లో బుల్లెట్ గాయాలతో తప్పించుకుని..
మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరిన చామల కిష్టయ్యకు గన్మెన్గా దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు స్వామి ఉండేవాడు. ఉత్తరాంధ్ర(ఇప్పుడు ఏఓబీ)లో పనిచేస్తుండగా 2008లో పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో స్వామి మృతిచెందాడు. అప్పుడు కిష్టయ్య బుల్లెట్ గాయాలతో తప్పించుకున్నాడు. ఉద్యమం కోసం జీవితాంతం తపించిన కిష్టయ్య ఎన్కౌంటర్లో మరణించడంతో అతడి సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానానికి తెరపడింది.
ఎన్కౌంటర్లో నయీమ్ గురువు హతం
Published Mon, Oct 24 2016 6:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement