మే ఒకటి నుంచి కర్ణాటక సెట్ | CET fee and seat pattern remains unchanged in Karnataka | Sakshi
Sakshi News home page

మే ఒకటి నుంచి కర్ణాటక సెట్

Mar 10 2014 4:26 AM | Updated on Sep 2 2017 4:31 AM

కర్ణాటకలో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సీఈటీ) మే ఒకటో తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనుంది.

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వైద్య, దంతవైద్య, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సీఈటీ) మే ఒకటో తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనుంది. కర్ణాటక, కర్ణాటకేతరులు కూడా పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 5లోపు అందించాల్సి ఉంటుంది. హొరనాడు, గడినాడు విద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షలో 50కి కనీసం 12 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అప్పుడే సీఈటీలో సీటుకు అర్హులని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు 080-23461575, 23568202, 23564583 లేదా www.kea.kar.nic.in లో సంప్రదించవచ్చని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement