ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ | Central Cabinet Ministers Meet PM House Over Telangana | Sakshi
Sakshi News home page

ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ భేటీ

Dec 5 2013 5:36 PM | Updated on Sep 2 2017 1:17 AM

ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది.

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి కేంద్ర కేబినెట్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉదయం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రధాని మన్మోహన్ సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం భేటీ అయ్యింది. ఈ భేటీకి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, పి. చిదంబరం, ఆంటోనీ, జైరాం రమేష్‌, వీరప్ప మొయిలీ, నారాయణస్వామి, జైపాల్‌రెడ్డి,  పల్లంరాజు, కావూరి సాంబశివరావు, కిశోర్‌చంద్రదేవ్‌లు హాజరైయ్యారు.

 

ఈ సమావేశంలో టేబుల్ ఐటమ్ గా టీ.బిల్లు కేబినెట్ ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు -2013కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. జీవోఎం నివేదిక, విభజనపై ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదం తెలుపుతారని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలూ గట్టిగా చెప్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement