'అద్వానీని విస్మరిస్తున్న బీజేపీ' | BJP neglects LK Advani, says Shathrugna sinha | Sakshi
Sakshi News home page

'అద్వానీని విస్మరిస్తున్న బీజేపీ'

Jul 11 2015 3:30 PM | Updated on Mar 29 2019 9:31 PM

'అద్వానీని విస్మరిస్తున్న బీజేపీ' - Sakshi

'అద్వానీని విస్మరిస్తున్న బీజేపీ'

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ కోల్పోతోందని ఆ పార్టీ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు.

ముంబై: బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ కోల్పోతోందని ఆ పార్టీ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు. సంస్థాగత వ్యవహారాల్లో అద్వానీని సంప్రదించాలని, ముఖ్యమైన అంశాలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. ఆయనను విశ్వాసంలోకి తీసుకొని చురుకైన భాగస్వామ్యాన్ని పార్టీ స్వీకరిస్తుందని తాను ఆశిస్తున్నట్లు మీడియాతో అన్నారు.

ప్రస్తుతం తాము గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, కాని వాటిని అధిగమిస్తామనే నమ్మకముందని చెప్పారు. ప్రజలు బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై చాలా ఆశలు పెట్టుకున్నారన్నారు. తాను బిహార్ ముఖ్యమంత్రి పదవి రేసులో లేనని సిన్హా స్పష్టం చేశారు. తాను మోదీకిగాని, ఇంకా ఎవరికిగాని మద్దతుదారుడిని కానని, కేవలం బిహార్ మద్దతుదారునని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement