
ఓటర్ల తొలగింపుపై తేలే వరకు ఎన్నికలొద్దు
జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దాదాపు 7.9 లక్షల ఓటర్లను తొలగించారని..
జీహెచ్ఎంసీ వ్యవహారంపై సుప్రీంలో పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తొలగింపు వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దాదాపు 7.9 లక్షల ఓటర్లను తొలగించారని.. అవన్నీ వాస్తవంగా నకిలీవేనా, లేక పొరపాటున తొలగించారా అనేది తేలేవరకు ఎన్నికలు నిర్వహించవద్దని మహేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే, జస్టిస్ ప్రపుల్ల సి.పంత్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీవాత్సవ వాదనలు వినిపించారు.
జీహెచ్ఎంసీలో ఓటర్ల తొలగింపుపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తున్నాయని కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న ధర్మాససనం ఈ అంశాల తీవ్రతను తాము అర్థం చేసుకున్నామని, కానీ ఈ అంశాలన్నింటినీ హైకోర్టు ముందుంచాలని సూచించింది. దాంతో పిటిషనర్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.