మళ్లీ కోరలు చాస్తున్న కలరా!! | 30 patients with cholera symptoms identified in west bengal | Sakshi
Sakshi News home page

మళ్లీ కోరలు చాస్తున్న కలరా!!

Jul 28 2014 11:39 AM | Updated on Sep 2 2017 11:01 AM

ఎప్పుడో అంతమైపోయిందనుకున్న కలరా మళ్లీ కోరలు చాస్తోంది. తానున్నానంటూ రోగులతో పాటు వైద్యవర్గాలనూ కలవరపరుస్తోంది.

ఎప్పుడో అంతమైపోయిందనుకున్న కలరా మళ్లీ కోరలు చాస్తోంది. తానున్నానంటూ రోగులతో పాటు వైద్యవర్గాలనూ కలవరపరుస్తోంది. చాలా ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్ ప్రాంతంలో కలకలం సృష్టించిన ఈ వ్యాధి మళ్లీ అదే ప్రాంతంలో తన ఉనికిని చూపిస్తోంది. చిన్న పిల్లలు సహా ఈ వ్యాధి లక్షణాలున్న 30 మంది రోగులు పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ప్రాథమిక వైద్యకేంద్రంలోను, సమీపంలోని వైద్య శిబిరాల్లోను చేరినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.

'సజల్ ధార' పేరుతో వచ్చే రక్షిత మంచినీటి పథకం పైపులు, బోర్ వెల్స్ నీటినే తాగుతున్న ప్రజలకు ఈ వ్యాధి సోకడం గమనార్హం. వీళ్లందరినీ రామకృష్ణాపూర్ పీహెచ్సీలోను, సమీపంలోని వైద్యశిబిరాల్లోను శనివారం రాత్రి చేర్చారు. రోగులందరికీ కలరా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని ప్రధాన వైద్యాధికారి గిరీష్ చంద్ర బేరా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement