వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో పలువురు నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్ ప్రకటన విడుదల చేశారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో పలువురు నియామకమయ్యారు. ఈ మేరకు శనివారం పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్ ప్రకటన విడుదల చేశారు.
పార్టీ నిజామాబాద్ జిల్లా యూత్ కమిటీ అధ్యక్షుడిగా కె.నవీన్కుమార్, ప్రధాన కార్యదర్శిగా సి.హరినాథరెడ్డి, మెదక్ ప్రధాన కార్యదర్శిగా ఎం.విజయభాస్కరరెడ్డి, కార్యదర్శిగా బి.మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లా యూత్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఏఎన్ రాంమనోహర్, కార్యదర్శులుగా బి.శ్రీకాంత్రెడ్డి, పి.నరేందర్, కార్యదర్శిగా జి.సుమన్గౌడ్, కార్యవర్గ సభ్యుడిగా ఎస్.ఎస్.సూర్య, యువజన విభాగం హైదరాబాద్ కార్యదర్శిగా ఒమర్, సంయుక్త కార్యదర్శిగా జి.శివమణిరెడ్డి,కరీంనగర్ ప్రధానకార్యదర్శిగా వై.సంతోష్రెడ్డి నియమితులయ్యారు.