మంత్రి ఇల్లు ముట్టడి | Sakshi
Sakshi News home page

మంత్రి ఇల్లు ముట్టడి

Published Mon, Aug 3 2015 2:28 PM

womens dharna at minister lakshma reddy house

జడ్చర్ల(మహబూబ్‌నగర్): ఎన్నికలకు ముందు ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నీటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని మహిళలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ఎదుట ఈ రోజు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శనలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఆయన ఇంటి ముందు.. పట్టణంలోని తాలూక క్లబ్, విద్యానగర్, మసీదు ఏరియా ప్రాంతాలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో వచ్చి ఆందోళన చేపట్టారు.
.....................

Advertisement
Advertisement