గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్

Published Wed, Mar 4 2015 6:40 PM

గల్లా పట్టి హక్కు సాధించుకుంటాం: కేటీఆర్ - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగితే కరెంటు ఇస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ వాటాను గల్లాపట్టి సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రైతుల పంటలు ఎండిపోతున్నాయని మొరపెట్టుకుంటే సాగర్ నుంచి నీళ్లు ఇచ్చామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలను గుర్తించి త్వరలోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement