హన్మకొండ : షిర్డీ, ముంబై వెళ్లే ప్రయాణికుల కోసం ఉద్దేశించిన కాజీపేట-ముంబై వీక్లీ రైలు ప్రారంభించడంపై రైల్వేశాఖ దాగుడుమూతలు ఆడుతోంది. 2014-15 రైల్వే బడ్జెట్లో ఈ ట్రైన్ను ప్రవేశపెట్టిన రైల్వేశాఖ గత ఎనిమిది నెలలుగా ఈ విషయంపై నోరెత్తలేదు. తాజాగా కాజీపేట-ముంబై మార్గంలో ప్రత్యేక రైలు నడిపిస్తామంటూ ప్రకటన జారీ చేసింది. దీంతో కాజీపేట-ముంబై రైలు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా నడిపిస్తారా లేక మాటమాత్రంగా కొన్ని ట్రిప్పులు స్పెషల్ పేరుతో నడిపి ఆ తర్వాత మమ అనిపిస్తారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
భక్తులకు మేలు..
వరంగల్ జిల్లా మీదుగా ముంబైకి ప్రస్తుతం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు(కోణార్క్, విశాఖపట్నం-ముంబై- లోకమాన్య తిలక్ టెర్నినల్) నడుస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రైళ్లలో బెర్త్ రిజర్వేషన్ చేరుుంచుకోవడం కష్టంగా మారింది. దశాబ్ధ కాలంగా జిల్లా నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. అరుుతే ఇక్కడి నుంచి సీటు రిజర్వ్ చేసుకోవడం కష్టంగా మారడంతో ఎక్కువ మంది భక్తులు సికింద్రాబాద్ నుంచి రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అరుుతే ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికుల అవస్థలు తీర్చేందుకు గత బడ్జెట్లో రైల్వేశాఖ కాజీపేట - ముంబై (ఎల్టీటీ) రైలును ప్రవేశపెట్టింది. పైగా ఈ రైలు కాజీపేట-బల్లార్షా సెక్షన్లో ప్రయూణిస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లేవారికి మరో రైలు అందుబాబులోకి వచ్చినట్టైంది.
కొత్త రూటు.. ఎన్నో ప్రయోజనాలు..
గత బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించిన కాజీపేట-ముంబై (ఎల్టీటీ) రైలు పూర్తిగా కొత్త మార్గంలో ప్రయాణించనుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, రెండు ఏసీ త్రీటైర్, ఏడు స్లీపర్ క్లాసులు, ఆరు జనరల్ కలిపి మొత్తం 18 బోగీలు ఉంటాయి. ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 11:30కు ముంబై (ఎల్టీటీ)లో బయల్దేరి మరుసటి రోజు శనివారం మధాహ్నం 3 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం సాయంత్రం 5:45కు కాజీపేట నుంచి బయల్దేరి మరుసటి రోజు ఆదివారం ఉదయం 11:15కు ముంబై (ఎల్టీటీ) చేరుకుంటుంది. జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, మజ్రీకదన్, వాని, పింపల్కుట్, ఆదిలాబాద్, కిన్వత్, హిమాయత్నగర్డెక్కన్, భోకార్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్భని, జాల్నా, ఔరంగాబాద్, నాగర్సోల్, మన్మాడ్, నాసిక్, కళ్యాణ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. కాజీపేట-బల్లార్షా మార్గంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొత్త రైలు అందుబాటులోకి రానుంది. వారాంత ంలో ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్యాసింజరు రైళ్ల రాకపోకలకు టెర్మినల్గా ఉన్న కాజీపేట స్టేషన్ హోదా ఎక్స్ప్రెస్ టెర్మినల్గా అప్గ్రేడ్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడనుంది.
తాజాగా ప్రత్యేక పాట.. 2015 సెప్టెంబర్లో రైల్వేశాఖ ప్రకటించిన టైం టేబుల్లో కాజీపేట-ముంబై (ఎల్టీటీ) రైలుకు సంబంధించిన రాకపోకల వివరాలు ప్రకటించా రు. దీంతో రేపోమాపో రైలు ప్రారంభమవతుం దని ఆశిస్తున్న తరుణంలో రైల్వేశాఖ ప్రత్యేక రైలు గా పేర్కొంటూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట -ముంబై (ఎల్టీటీ)ల మధ్య డిసెంబర్ 11, 12, 18, 19, 26, 27 తేదీల్లో మూడు ట్రిప్పులు నడిపిస్తామని పేర్కొంది. ఈ రైలు టికెట్ల బుకింగ్ నేటి(డిసెంబర్ 3) నుంచి మొదలవుతాయని తెలిపింది. రైల్వే బడ్జెట్లో రెగ్యులర్గా పేర్కొన్న రైలును ఇప్పుడు ప్రత్యేక రైలుగా చూపిం చడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రైలు ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సి ఉంది. అరుుతే దీనిపై మన ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యూరని, అందుకే తూతూమంత్రంగా ఈ రైలును ప్రత్యేకంగా నడిపిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకం పేరుతో కొన్ని ట్రిప్పులు నడిపించి ఆ తర్వాత ఆదరణ కరువైందంటూ మొత్తానికే ఎత్తివేస్తారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
‘గాడి’లో పడేనా..?
Published Thu, Dec 3 2015 1:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement