విద్యుదాఘాతంతో ఓ వాటర్ వర్కర్ దుర్మరణం చెందాడు.
ఖమ్మం: విద్యుదాఘాతంతో ఓ వాటర్ వర్కర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని ఖాజీపురం గ్రామంలో వాటర్ పైపు లైన్ పనులు చేస్తుండగా పిక్కిలి ఏసు అనే వర్కర్కు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.