ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలి
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్) విభాగం అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో పాటు అధికారులు, సిబ్బంది కలసి చిత్తశుద్ధితో పనిచేస్తే గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమేనన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించడం ద్వారా అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆశయం కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ వాటర్గ్రిడ్ నీటి వనరుల గుర్తింపు, అలైన్మెంట్ ఖరారు, ట్రీట్మెంట్ ప్లాంట్ల స్థాపన తదితర అంశాలపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, జగదీశ్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సురేందర్రెడ్డి, బాబురావు, చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్రావు తదితరులు పాల్గొన్నారు.
భౌగోళిక స్థితి ఆధారంగా..: వివిధ జిల్లా ల్లో భౌగోళిక పరిస్థితులు, జనాభా అధారంగా ఎక్కడికక్కడే గ్రిడ్ పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వాటర్ గ్రిడ్ మొత్తం ‘గ్రావిటీ క మ్ లిఫ్ట్’ పద్ధతిలో ఉండాలన్నారు. నీటిని శుద్ధి చేశాకే గుట్టలపైకి పంపాలని, రివర్స్ ఇంజనీరింగ్ మాదిరి.. గుట్టపైకి పంపిన నీటిని గ్రావిటీ ద్వారా మళ్లీ కిందకు పంపి జనావాసాలకు నీరందించాలన్నారు.
రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నీటిని పంపింగ్ చేసేందుకు ఎంత విద్యుత్ అవసరం, ఎక్కడెక్కడ సబ్స్టేషన్లు నిర్మించాలి తదితర అంశాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులకు సమాంతరంగా విద్యుత్ పనులు కూడా నిర్వహించాలన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసమే కేటాయించాలని స్పష్టంచేశారు. వాటర్ గ్రిడ్కు నీటి కొరతగానీ, నిధుల కొరతగానీ లేదన్నారు. రిజర్వాయర్లలోని నీటిని మంచినీటి గ్రిడ్ల కోసం వాడుకోవడానికి అనుమతిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ఆనీకట్ పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
8 గంటల పాటు సమీక్ష..: వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేసీఆర్ గత రెండ్రోజులుగా సుదీర్ఘం గా సమీక్ష జరిపారు. మంగళవారం కొన్ని అంశాలపై చర్చించిన సీఎం బుధవారం మిగిలిన అంశాలపై ఏకంగా ఎనిమిది గంటలపాటు సమీక్షించడం విశేషం. సమీక్షలో ప్రధానంగా.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో గ్రిడ్ పనులు ఎలా నిర్వహించాలి, ఎక్కడెక ్కడ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, ఏఏ వనరుల నుంచి నీటిని తీసుకోవాలి, సమీపంలో ఉన్న గుట్టలు ఏంటి, ఎన్ని మీటర్ల మేర నీటిని లిఫ్టు చేయాలి తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. కాంటూర్ ఎత్తులు గుర్తించి ఏవేవి వాటర్ గ్రిడ్లకు ఉపయోగ కరమో నిర్ధారించారు.
రెండేళ్లలోనే వాటర్ గ్రిడ్!
Published Thu, Jan 1 2015 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement