మోదీ దిష్టిబొమ్మ దహనం చేయండి | uttam kumar reddy fired on pm narendra maodhi | Sakshi
Sakshi News home page

మోదీ దిష్టిబొమ్మ దహనం చేయండి

Nov 14 2016 3:30 AM | Updated on Sep 19 2019 8:44 PM

నోట్ల రద్దులో సరైన వ్యూహం, ప్రణాళిక, అవగాహన లేకుండా చేసిన ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను రాష్ట్రం దహనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పిలుపునిచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దులో సరైన వ్యూహం, ప్రణాళిక, అవగాహన లేకుండా చేసిన ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను రాష్ట్రం దహనం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. రూ.1000, రూ.500 నోట్లను అకస్మాత్తుగా రద్దు చేసిన కేంద్రం.. దానివల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడంలో ముందుచూపుతో వ్యవహరించలేదని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. దీనివల్ల పేద, మధ్యతరగతికి చెందిన మహిళలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement