ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి | Two killed in road Accident in nizamabad district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి

Jan 22 2016 8:28 AM | Updated on Aug 30 2018 3:58 PM

నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం సిర్నపల్లి సమీపంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం సిర్నపల్లి సమీపంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement