రోడ్డు ప్రమాదం:ఇద్దరు విద్యార్థుల మృతి | two killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం:ఇద్దరు విద్యార్థుల మృతి

Jan 8 2015 8:25 AM | Updated on Apr 3 2019 7:53 PM

నగరంలోని చాదర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.

హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. టిప్పర్ ను తప్పించబోయిన ఓ కారు విక్టరీ ప్లే గ్రౌండ్స్ దగ్గర గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంగా కారును నడపడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

 

ప్రమాదంలో గాయపడిన వారికి ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన విద్యార్థులను వరుణ్, నరేందర్ గా పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement