‘స్పీకర్‌ను విమర్శించే అర్హత వారికి లేదు’ | trs leaders fire on tdp | Sakshi
Sakshi News home page

‘స్పీకర్‌ను విమర్శించే అర్హత వారికి లేదు’

Jun 14 2016 12:13 AM | Updated on Aug 20 2018 6:47 PM

శాసన సభాపతి, స్పీకర్ మధుసూదనాచారిని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని టీఆర్‌ఎస్ యూత్ జిల్లా

భూపాలపల్లి: శాసన సభాపతి, స్పీకర్ మధుసూదనాచారిని విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదని టీఆర్‌ఎస్ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు మారెళ్ల సేనాపతి అన్నా రు. పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ యూత్ నాయకులు బిల్ల అశోక్‌రెడ్డి, తిప్పాని రంజిత్, బంటి రమేష్, శ్రీకాంత్, వేశాల రవి, అశోక్, ప్రదీప్ పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement