ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు    | Three children in single delivery | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు   

May 16 2018 11:52 AM | Updated on Aug 17 2018 2:56 PM

Three children in single delivery - Sakshi

పిల్లలను రిమ్స్‌లో చిల్డ్రన్స్‌ వార్డులో ఉంచిన దశ్యం 

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చింది. మహారాష్ట్రలోని కిన్వాట్‌ ఆసీఫ్‌ తన భార్య అంజూమ్‌ను పురిటినొప్పులు రావడం తో సోమవారం రిమ్స్‌కు తీసుకొచ్చాడు. అయి తే ఆమెకు ఇంకా 9 నెలలు కూడా నిండకపోవడంతో వైద్యులు రిమ్స్‌లో అడ్మిట్‌ చేసుకున్నారు. అయితే మంగళవారం తీవ్ర నొప్పులు రావడంతో ఆపరేషన్‌ చేసి కాన్పు చేశారు. దీం తో ఆమెకు ఇద్దరు పాపలు, ఒక బాబు పు ట్టారు. మొదటి కాన్పు, అదీ కూడా 8 నెలలకే ప్రసూతి అయినప్పటికీ పుట్టిన శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇందులో ఒకరు 1.5 కేజీ, మరొకరు 1.25 కేజీ, బాబు1.3 కేజీలు ఉన్న ట్లు చిల్డ్రన్స్‌ డాక్టర్‌ సూర్యకాంత్‌ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement