ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి | They are responsible for the deaths CM: Bhatti | Sakshi
Sakshi News home page

ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి

Jan 24 2015 2:57 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి - Sakshi

ఆ మరణాలకు సీఎందే బాధ్యత: భట్టి

స్వైన్‌ఫ్లూ మరణాలకు సీఎం చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మరణాలకు సీఎం చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాలో ఆయన మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం వల్లే స్వైన్‌ఫ్లూ వ్యాప్తి చెందిందని, ఆ శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు.ప్రభుత్వం ఏర్పడి 8నెలలు కావస్తున్నా పాలనపై దృష్టి పెట్టకుండా కాశీమజిలీ కథలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నారని విమర్శించారు. స్వైన్‌ఫ్లూ విస్తరించే అవకాశం ఉందని గతంలో హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే సీహెచ్ వంశీచంద్‌రెడ్డి దుయ్యబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement