- మేడారం టెండర్లలో సీన్ రిపీట్
- ఐటీడీఏ కార్యాలయం సాక్షిగా
- డబ్బు పంపిణీ లెస్గా కోట్ చేసే
- కాంట్రాక్టర్లకు బెదిరింపులు
ఏటూరునాగారం : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ ద్వారా చేపట్టిన 12 అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు రింగ్ అయ్యూరు. రూ.1.01 కోట్ల నిధులతో చేపట్టిన టెండ ర్లలో సీన్ రిపీట్ అయింది. ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సోమవారం కాంట్రాక్టర్లు రింగ్ కావడానికి ఒక షెడ్యూల్కు రూ. 5 వేల చొప్పున కొనుగోలు చేశారు. లెస్ వేసే కాంట్రాక్టర్లను బెదిరిస్తూ షెడ్యూళ్లను రద్దు చేయించారు. గతనెల 30న జరిగిన టెండర్ల రింగ్ ప్రక్రియే ఇప్పుడు కూడా యథేచ్చగా సాగింది. గిరిజన సంక్షేమ శాఖకు ఈ-ప్రొక్యూర్మెంట్ పెట్టే అవకాశం ఉన్నా.. ఓపెన్ టెండర్లకు అధికారులు మొగ్గు చూపడం తో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు లెస్కు టెండర్ వేసే వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఐటీడీఏ కార్యాలయం సమీపంలోనే కాంట్రాక్టర్ల వద్ద ఉన్న షెడ్యూళ్ల ఫారాలను డబ్బులు ఎరచూపి తీసుకోవడం గమనార్హం.
కలెక్టర్, పీఓ ఆదేశాలు బేఖాతర్..
గిరిజన సంక్షేమ శాఖ టెండర్లలో ఎలాంటి అక్రమాలు, అవినీతి లేకుండా పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కరుణ, ఐటీడీఏ పీఓ అమయ్కుమార్ ఆదేశాలను ఇంజనీరింగ్ అధికారులు బుట్టదాఖలు చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు కాకముందే ఎలాంటి అక్రమాలు జరిగినా సస్పెం డ్ చేస్తామని పీఓ ఇంజనీరింగ్ కార్యాలయం సిబ్బందిని హెచ్చరించినా.. అదే తంతు జరిగిం ది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా డబ్బు పంపిణీకి తెగించారు. ఇలా సిండికేట్ అయిన పనులకు తక్కువ లెస్గా నమోదు కాగా, సిండికేటు కాని పనులకు సుమారు 28 శాతం లెస్కు పోవడం గమనార్హం.
104 టెండర్లు దాఖలు..
ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపట్టబోయే 12 అభివృద్ధి పనులకు సోమవారం టెండర్లను ఓపెన్ చేశారు. 104 టెండర్లు దాఖలు అయ్యాయని డీఈఈ మల్లయ్య తెలిపారు. ఇం దులో 96 టెండర్లను ఓపెన్ చేశామన్నారు. అలాగే వై. రవి అనే వ్యక్తి 9 టెండర్లను బాక్స్లో వేసినప్పుడు అతడి లెటర్ ప్యాడ్పై ఈ టెండర్లు ఓపెన్ చేయవద్దని రాసిన కాగితం లభించడంతో ఆ టెండర్లను ఓపెన్ చేయలేదన్నారు. ఈఈ ఆదేశాల మేరకు వాటిని మంగళవారం ఓపెన్ చేస్తామని చెప్పారు. అయితే లెటర్ ప్యాడ్ అసలైనది కాదని, కేవలం జిరాక్స్ పేపర్పై స్థానిక కాంట్రాక్టర్లు సంతకం చేసి టెండర్ బ్యాక్స్లో వేశారని బాపిరెడ్డి అనే వ్యక్తి డీఈఈకి వివరించారు. దీం తో ఆ తొమ్మిది టెండర్ల ప్రక్రియ వాయిదా పడిం ది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేం దర్, ఏటీఓలు ప్రభుదాస్, శ్రీనివాస్, జేటీఓ ముత్తయ్య పాల్గొన్నారు.
టెండరింగ్!
Published Tue, Dec 15 2015 3:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement