నిర్మాతలు సీఎం జగన్‌ను కలవడం మంచిదే | Talasani Srinivas Yadav Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

స్వామివారిని దర్శించుకున్న తలసాని

Feb 27 2020 1:56 PM | Updated on Feb 27 2020 2:34 PM

Talasani Srinivas Yadav Visits Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుమల: సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం మంచి పరిణామమని, అందులో తప్పేమీ లేదని తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సుపరిపాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో కూడా సీఎం జగన్‌ రైతులు, ప్రజలకు మంచి పాలన అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ప్రతిపక్షాలు విమర్శించినా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్నారు. కాగా చంద్రబాబునాయుడు ఎన్నికలు జరిగిన 20 రోజుల నుంచే ప్రతిరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని తలసాని విమర్శించారు. ఇక మూడు రాజధానుల అంశంపై స్పందిస్తూ అది ఏపీకి సంబంధించిన విషయమని దాటవేశారు. (సీఎంను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement