పోలింగ్‌ బూత్‌లో  ఫొటోలు తీస్తే చర్యలు  | Strict Actions Against those Taking Photographs in Polling Booths | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బూత్‌లో  ఫొటోలు తీస్తే చర్యలు 

May 12 2019 5:05 AM | Updated on May 12 2019 5:05 AM

Strict Actions Against those Taking Photographs in Polling Booths - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ బూత్‌లలో ఫొటోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. కొంతమంది పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లు పోలింగ్‌ సందర్భంగా ఓటు వేస్తున్న ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌ కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా ఫొటోలు తీసే వారికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement