వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి | Srinivasa Reddy selected as a YSRCP Farmer cell Main secretary in Mahabubnagar | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి

Jun 19 2015 5:08 PM | Updated on Oct 8 2018 5:04 PM

వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి - Sakshi

వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా ప్రధానకార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేటకు చెందిన తోకల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు.

అచ్చంపేట రూరల్ (మహబూబ్‌నగర్) :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేటకు చెందిన తోకల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాం సుందర్‌రెడ్డి శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జిల్లా సంయుక్త కార్యదర్శిగా కారే కృష్ణను నియమించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర నేత భగవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement