వన బోజనంలో అపశృతి.. ఆరుగురు మృతి ! | Six people died in the Pond in Warangal district | Sakshi
Sakshi News home page

కుంటలో మునిగి ఆరుగురు మృతి..

Nov 15 2017 6:57 PM | Updated on Sep 17 2018 8:02 PM

Six people died in the Pond in Warangal district - Sakshi

సాక్షి, వరంగల్‌: వనభోజనానికి వచ్చిన కుటుంబాల్లో విషాదచాయాలు అలుముకున్నాయి. వనభోజనానికి వచ్చిన ఆరుగురు బాలురు బుధవారం గ్రామానికి సమీపంలోని కుంటలో ఈతకు దిగారు. ప్రమాదవశాత్తూ వారు మునిగి చనిపోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొత్తపేటలో చోటుచేసుకుంది.

ఈతకు దిగిన వారిలో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన బాలురు నదీమ్‌ షా(16), మొమిన్‌(14), రసూల్‌(13), రంజాన్‌(16)లుగా గుర్తించారు. వీరి మరణంతో ఆ గ్రామం కన్నీటి సుడుల్లో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కలిచి వేసింది

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement