నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ సస్పెండ్‌ | Sakshi
Sakshi News home page

నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ సస్పెండ్‌

Published Thu, Aug 10 2017 8:52 PM

SI Ravinder susepended in Nerella insident

సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సిరిసిల్ల సీసీఎస్‌ ఎస్ఐ రవీందర్‌ను గురవారం డీఐజీ సస్పెండ్‌ చేశారు. నేరెళ్ల ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ అతిగా ప్రవర్తించినట్టు తేలడంతో సస్పెండ్‌ చేసినట్టు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇసుక లారీలకు నిప్పు పెట్టిన ఘటనలో నేరెళ్లకు చెందిన కొంత మందిని పోలీసులు అరెస్టు చేసి, తీవ్రంగా హింసించారనేది ఆరోపణ. చిత్రహింసలకు గురైనవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement