వైభవంగా మల్లన్న జాతర
శివసత్తులు, భక్తులతో కిక్కిరిసిన ఆలయం
మార్మోగిన మల్లికార్జునుడి నామస్మరణ
భక్తి భావాన్ని నింపిన మల్లన్న ఒగ్గు కథ
బండారి మయమైన రహదారులు
చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునుడి జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం పతాకస్థారుుకి చేరుకున్నారుు. పట్నం వారం సందర్భంగా మల్లన్న ఆలయంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ఉద యం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయ రాజగోపురం, గంగిరేగు చెట్టు మధ్య భాగంలో మాణిక్య యాదయ్య యాదవ్, బండారు దుర్గారాజు ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన యాదవ భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ఒగ్గు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ చెప్పి మల్లన్న కథ భక్తుల్లో భక్తిభావాన్ని నింపింది. అగ్నిగుండాల కోసం సుమారు ఐదు క్వింటాళ్ల సమిధలను పేర్చి... వాటిని భగభగమండే నిప్పురవ్వలుగా తయారు చేశారు.
ఆ తర్వాత అర్చకులు మల్లికార్జున్, సాంబయ్య ఆలయ గర్భగుడిలోని ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండాలు, పెద్దపట్నం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఉత్సవ విగ్రహా లకు వీరితోపాటు ఆలయ అధికారులు, డీఏస్పీ సురేందర్, సీఐ వెంకటేశ్వర్రెడ్డి, ఏఈఓ అంజయ్య తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ యాదవ భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండాల చుట్టూ పసుపు నీళ్లు చల్లి అష్టదిగ్బం దనం చేశారు. అనంతరం ఆలయ అర్చకుడు మల్లికార్జున్తోపాటు పలువురు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని ముందుగా పెద్దపట్నం, ఆ తర్వాత అగ్నిగుండాలను దాటారు. వారిని శివసత్తులు, యాదవ భక్తులు మల్లన్న నామస్మరణ చేస్తూ అనుసరించారు. జానపదుల వీడియో ఆల్బమ్లో మల్లన్నగా నటించిన, సినీనటుడు లాలాజీ ఘన్శ్యాం అగ్ని గుండాలను దాటారు.
అంతా బండారు మయం
అగ్నిగుండాలను కనులా వీక్షించేందుకు వచ్చిన మల్లన్న శివసత్తులతో గంగిరేగు చెట్టు వద్ద ఉన్న మూడు గ్యాలరీలు నిం డిపోయూరుు. పలువురు శివసత్తులు, భక్తులను రాజగోపు రం వద్దనే నిలపివేయడంతో తోటబావి, పోలీస్ బొమ్మ, పెద్దమ్మ ఆలయూనికి వెళ్లే రహదారులు కిక్కిరిసిపోయూరుు. శివసత్తులు నుదుట, తలపై పసుపు చల్లుకోవడంతో ఆల య ప్రాంగణంతోపాటు ఆ రోడ్లన్నీ బండారి మయమయ్యూయి. రాజగోపురం బయట ఉన్న భక్తులు అగ్నిగుండం దాటేందుకు రెండు గంటల సమయం పట్టడడంతో తీవ్ర ఇబ్బం దులు పడ్డారు. రాజగోపురం వద్ద స్వల్ప తోపులాట చోటుచేసుకోగా.. పందిరి కట్టెలు విరిగిపోయూరుు. పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఏస్పీ సురేందర్ ఆధ్వర్యంలో సీఐ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్ఐ రవీందర్ పర్యవేక్షించారు. అగ్నిగుండాలు దాటుతూ హైదరాబాద్కు చెందిన యాదమ్మ పడిపోరుుంది. సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. కార్యక్రమం అనంతరం ఆనవాయితీ ప్రకారం హైదరాబాద్ యాదవ భక్తులు, శివసత్తులకు ఆలయ ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్ నీల చంద్రశేకర్, వైరాగ్యం జగన్ తదితరులు కొత్త బట్టలు అందజేసి సన్మానించారు.
పెద్దపట్నం... అగ్నిగుండం
Published Tue, Jan 20 2015 12:55 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
గ్రాండ్గా జరిగిన 'డర్టీ ఫెలో' ప్రీ రిలీజ్ ఫంక్షన్
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సీఎం రేవంత్ భేటీ
సెల్ఫోన్స్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
Sushmita Sen Throwback Photos: అందానికి పట్టాభిషేకం.. మిస్ యూనివర్స్గా 'సుస్మితా సేన్' 30 ఏళ్ల నాటి ఫోటోలు
పెళ్లిరోజు గిఫ్ట్తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య
ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ భద్రతా చర్యలపై చర్చ
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- 'ఫ్యామిలీస్టార్'ను వాళ్లు కావాలనే టార్గెట్ చేశారు: ఆనంద్
- బరువు తగ్గాలనుకుంటే..ఆ ఆహారాలకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
Advertisement