ట్రాక్టర్, బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం | road accident one died in khammam district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ.. యువకుడి దుర్మరణం

Oct 25 2015 6:57 PM | Updated on Aug 30 2018 3:56 PM

ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. చర్ల మండలం శుభంపేట వద్ద కల్యాణ్ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. చర్ల మండలం శుభంపేట వద్ద కల్యాణ్ బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో కల్యాణ్ అక్కడిక్కడే మరణించగా విజయ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కల్యాణ్ స్వగ్రామం కూనవరం మండలం పైడిగూడెంగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement