వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్బాబు చొరవతో ఏపీలోని కడప జిల్లా మాదారం సిద్దోట మండలానికి చెందిన ఓ మహిళకు రియాద్లో
సుబ్బలక్ష్మి ఉపాధి కోసం దుబాయికి వెళ్లేందుకు ఏజెంట్లు జిలానీ, వెంకటేశ్, వలీలను సంప్రదించి రూ.80 వేలు అందజేసింది. వారు ఆమెను దుబాయికి కాకుండా రియాద్ దేశంలోని అబ్ధుల్లా షేక్కు రూ.2 లక్షలకు అమ్మేశారు. అక్కడ సుబ్బలక్ష్మి కొన్నాళ్లకు అనారోగ్యానికి గురైంది. షేక్ ఆమెకు చికిత్స చేయించకుండా ఓ గదిలో బంధించి హింసకు గురిచేశాడు. ఆ దృశ్యాలను ఆమె తన తమ్ముడదికి వాట్సప్లో పంపింది. ఈ నెల 7న సీపీ సుధీర్బాబు నంబరుకు ఆమె బంధువులు ఆ వీడియోను పంపడంతో అప్రమత్తమై డీసీపీ ఇస్మాయిల్ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సుబ్బలక్ష్మి యాజమాని అబ్ధుల్లా షేక్తో ఏజెంట్ ద్వారా సంప్రదింపులు జరిపించడంతో పాటు అతనికి ఇవ్వాల్సిన రూ.2 లక్షలను కూడా ఏజెంటుతోనే ఇప్పించారు. ఆమెను అక్కడినుంచి రప్పించి ఆమె భర్త పెంచలయ్యకు సోమవారం అప్పగించారు.