నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండలంలోని కురమేడు గ్రామం వద్ద డీసీఎం వాహనాన్ని డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. దీంతో డీసీఎం వాహనంలోని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.