ఇసుక లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి


ఏటూరునాగారం : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం పోతురాజుగడ్డలో సోమవారం ప్రమాదవశాత్తూ ఇసుక లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్లీనర్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top