రైలు నుంచి పడి వృద్ధురాలి మృతి | old woman died in rr district | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి వృద్ధురాలి మృతి

Apr 23 2015 12:45 AM | Updated on Sep 28 2018 3:39 PM

ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందింది.

తాండూరు : ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ సంఘటన బుధవారం ఉదయం ధారూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్‌ల మధ్యలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం..ధారూరుకు చెందిన హరిజన్ పోచమ్మ(64) పని నిమిత్తం బుధవారం ఉదయం ధారూరు నుంచి తాండూరుకు ప్యాసెంజర్ రైలులో బయలుదేరింది. మార్గం మధ్యలోని ధారూరు-రుక్మాపూర్ స్టేషన్‌ల మధ్యలో ఆమె ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వేస్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement