మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి | NREGA workers died in jagtial district | Sakshi
Sakshi News home page

మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి

May 8 2018 2:11 PM | Updated on Sep 28 2018 3:39 PM

NREGA workers died in jagtial district - Sakshi

సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో  ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కూలీలను చికిత్స నిమిత్తం మెట్‌పల్లి సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముత్తమ్మ(45), రాజు(55), జెల్లా పోషాని(50) అనే ముగ్గరు కూలీలు మృతి చెందారు. మిగతా ఇద్దరు కూలీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కూలీల మృతిలో గ్రామంలో విషాదం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement