'హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది' | Nayani Narsimha reddy pay tributes to Telangana Martyrs Memorial | Sakshi
Sakshi News home page

'హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది'

Jun 2 2015 9:34 AM | Updated on Oct 20 2018 5:05 PM

'హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది' - Sakshi

'హామీల అమలులో తెలంగాణ ప్రభుత్వం ముందుంది'

తెలంగాణ ప్రభుత్వం హామీ అమలులో ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హామీ అమలులో ముందుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ...  తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఏ ఎన్నికలొచ్చినా మేమే విజయం సాధిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారని నాయిని నరసింహరెడ్డి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement