సాక్షి, హైదరాబాద్: రాజధాని నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే రైలు మార్గాన్ని పొడిగించేందుకు రైల్వేశాఖ సిద్ధంగా ఉంది. రాయగిరి నుంచి యాదాద్రి (4 కి.మీ.) వరకు కొత్త లైన్లను నిర్మించి, విద్యుదీకరించి, యాదాద్రిలో స్టేషన్ నిర్మిస్తారు. స్టేషన్ నిర్మాణానికి 40 నుంచి 50 ఎకరాలు కేటాయించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తలైన్లు, రైల్వేసేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను రైల్వేశాఖ సీరియస్గా పరిశీలిస్తుందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరం ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రెండో దశను పొడిగించేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ మార్గాన్ని రాయగిరి వరకు పరిమితం చేయకుండా యాదాద్రి వరకు విస్తరించాలని ప్రభుత్వం కోరితే మరో 3 ఏళ్లలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
లక్షలాది మందికి రైల్వే సదుపాయం ...
ప్రస్తుతం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రతి రోజు సుమారు 3 లక్షల మంది సందర్శిస్తుండగా, శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య 5 లక్షలు దాటుతోంది. హైదరాబాద్ నుంచి వందలాది బస్సులు, వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను విస్తరించేందుకు రైల్వేశాఖ రూ.330 కోట్లతో ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో 51 శాతం నిధులను రాష్ట్రం భరిస్తే మిగతా 49 శాతం నిధులను రైల్వేశాఖ భరించనున్నట్లు ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఏప్రిల్లో టెండర్లు ఆహ్వానించేందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయిస్తే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పూర్తవుతుందని రైల్వే అధికారులు వెల్లడిస్తున్నారు. యాదాద్రి వరకు రైల్వేమార్గాన్ని పొడిగిస్తే 5 ప్లాట్ఫామ్లతో ఒక టర్మినల్ను నిర్మించే యోచన చేస్తున్నారు.
యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్!
Published Thu, Feb 1 2018 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement