- తాజా ప్రకటనతో ఊరట
- తాకట్టులో రూ.284 కోట్లు
- 28,083 మంది రైతులకు ఊరట
- మొత్తంగా రూ.2,984 కోట్ల మాఫీ
- జిల్లాలో 5.05 లక్షల మందికి లబ్ధి
బంగారం తాకట్టు పెట్టిన రైతులకు ఊరట లభించింది. పంట రుణాలతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటంతో రుణమాఫీ అయోమయానికి తాత్కాలికంగా తెరపడింది. తాజా ప్రకటనతో జిల్లాలో మొత్తం 5.05 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మొత్తంగా రూ.2984 కోట్లు మాఫీ కానున్నాయి.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే రుణమాఫీ పథకం గందరగోళానికి తెరలేపింది. కేవలం గత ఏడాది తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తామని, పాత బకాయిలు పరిగణనలోకి తీసుకోరని, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదంటూ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించటంతో పాటు అదే కోణంలో బ్యాంకర్ల నుంచి సమాచారం కోరింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బెజ్జంకి మండలంలో తన రుణం మాఫీ కావటం లేదనే మానసిక వ్యథతో ఒక రైతు గుండెపోటుతో చనిపోగా.. ఎల్లారెడ్డిపేట మండలంలో మరొక తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని, నిర్ణీత గడువు నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఎట్టకేలకు ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మరింత స్పష్టమైన వివరణ ఇచ్చింది. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలకు సైతం మాఫీ వర్తిస్తుందని, శుక్రవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో జిల్లాలోని బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టిన రైతులు సైతం ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. మొత్తంగా దాదాపు అయిదు లక్షల మందికి రుణమాఫీ వర్తించనుంది. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో 28,083 మంది రైతులు బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నారు. మార్చి 31 వరకు బంగారం తాకట్టుపై తీసుకున్న రుణాల మొత్తం రూ.284 కోట్లు. గత ఏడాది వ్యవధిలోనే బంగారంపై రూ.70 కోట్ల రుణాల పంపిణీ జరిగింది.
తాజా నిర్ణయంతో ఈ రుణాలన్నీ మాఫీ అయ్యే అవకాశముందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని బ్యాంకుల్లో మొత్తం రూ.4,122 కోట్ల రుణాలు రైతుల పేరిట ఉన్నాయి. వీటిలో రూ.2,700 కోట్లు పంట రుణాలు కాగా.. మిగతావి వ్యవసాయ, అనుబంధ టర్మ్ రుణాలు. బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను సైతం టర్మ్ రుణాలుగానే పరిగణిస్తారు.
టర్మ్ రుణాలకు రుణమాఫీ వర్తించే అవకాశం లేకున్నా... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. మొత్తంగా జిల్లాలో 4,77,663 మంది రైతులు వీటి పరిధిలో పంట రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి రైతుల పేరిట ఉన్న పంట రుణాల మొత్తం రూ.2,700 కోట్లు. వీటితో పాటు బంగారం రుణాలు కలిపి.. మొత్తంగా రూ.2,984 కోట్లు మాఫీ చేసేందుకు సర్కారు నడుం బిగించింది. దీంతో జిల్లాలో మొత్తం 5,05,746 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
రుణమే బంగారమాయే
Published Sun, Jun 15 2014 2:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
Sanjeeda Sheikh: చీరలో అదరగొడుతున్న హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement