Sakshi News home page

భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్

Published Fri, Mar 27 2015 9:18 PM

భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్ - Sakshi

భద్రాచలం: సీతరామ కళ్యాణోత్సవంలో భాగంగా సీఎం కె.చంద్రశేఖర రావు శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. ఈరోజు రాత్రి భద్రాచలంలో బస చేయనున్న కేసీఆర్ శనివారం ఉదయం స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 

 

మధ్యాహ్నం మణుగూరులో విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటిసారి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండటం విశేషం.

Advertisement
Advertisement