'రాష్ట్రాన్నిఅమ్మకానికి పెడతారా' | jeevan reddy slams on kcr | Sakshi
Sakshi News home page

'రాష్ట్రాన్నిఅమ్మకానికి పెడతారా'

Jan 30 2015 3:57 PM | Updated on Aug 14 2018 10:51 AM

'రాష్ట్రాన్నిఅమ్మకానికి పెడతారా' - Sakshi

'రాష్ట్రాన్నిఅమ్మకానికి పెడతారా'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టేలా ఉందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే  రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టేలా ఉందని కాంగ్రెస్ నేత  జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయనిక్కడ మాట్లాడుతూ... వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని తరలించాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సచివాలయం తరలింపు వల్ల ప్రభుత్వంపై వేల కోట్ల భారం పడుతుందని జీవన్ రెడ్డి చెప్పారు. సీఎం వ్యక్తిగత నమ్మకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై భారం పడేలా ఉండరాదని సూచించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement