సిరిసిల్ల: గల్ఫ్లో ఉన్న రైతులకు కూడా ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం ఆయన ‘రైతుబంధు పథకంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్థానికంగా ఉన్న రైతులకు పెట్టుబడి సాయం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. ఈనెల 17వ తేదీ తర్వాత గల్ఫ్లో ఉన్న వారికి.. చిన్నచిన్న సమస్యలతో ఆగిన వారికి చెక్కులను అందిస్తామని మంత్రి వెల్లడించారు. రైతులందరికీ రైతుబంధు పథకం వర్తిస్తుందన్నారు.
ఇందులో ఆ పార్టీ, ఈ పార్టీ అనే భేదంలేదన్నారు. ఇంతపెద్ద కార్యక్రమంలో చిన్నచిన్న పొరపాట్లు ఉంటే.. సవరించేందుకు ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు. ఎవరైనా గొడవలు చేసినా భయపడేది లేదని, ధర్నాలు చేయించినా.. ఆందోళన పడొద్దని మంత్రి కోరారు. అలాగే కేవలం చెక్కులు ఇచ్చి వెళ్లిపోకుండా ప్రతి రైతును కలవాలని కేటీఆర్ సూచించారు.
టీఆర్ఎస్ నాయకులు బస్సుల్లో రావాలి.
ఈనెల 10న హుజూరాబాద్లో జరిగే సీఎం సభకు జిల్లా నుంచి 25వేల మంది రైతులు రావాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ నాయకులు కార్లలో కాకుండా రైతులతోపాటు బస్సుల్లో రావాలన్నారు. ఏ ఊరి నాయకులు ఆ ఊరి రైతులతో కలసి రావాలని, బస్సులకు మామిడి తోరణాలు కట్టుకుని దసరా పండుగలాగా.. సంతోషంగా రావాలని సూచించారు. రెండురోజుల పాటు ఇసుక లారీలు, గ్రానైట్ లారీలను ఆపి వేయాలని ఎస్పీ రాహుల్హెగ్డేను కోరారు.
అందరూ క్షేమంగా ఇల్లు చేరే విధంగా టీఆర్ఎస్ నాయకులు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. ఎండల నేపథ్యంలో చెక్కుల పంపిణీని ఉదయం, సాయంత్రం వేళల్లో చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డే, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
గల్ఫ్లో ఉన్న రైతులకూ పెట్టుబడి సాయం
Published Mon, May 7 2018 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement