తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు తెలంగాణ మంత్రి మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ఈరోజు ఇక్కడ సమావేశమైన మంత్రి మండలి ఉద్యోగుల ఇంక్రిమెంట్ విషయమై చర్చించింది. ఇందు కోసం ప్రభుత్వంపై ఏటా180 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.
సమావేశంలో ఇంక్రిమెంట్ల విషయమై శాఖలవారీగా చర్చించారు. అలాగే పలు కీలక అంశాలపై కూడా తెలంగాణ మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంది.