‘నెబ్యులా’తో మెట్రో రైలు జర్నీ.. | Hyderabad Metro Rail Smart Card | Sakshi
Sakshi News home page

‘నెబ్యులా’తో స్మార్ట్‌ జర్నీ..

Nov 16 2017 2:36 PM | Updated on Sep 4 2018 3:39 PM

Hyderabad Metro Rail Smart Card - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మెట్రో రైలు ప్రయాణాన్ని ‘స్మార్ట్‌’ చేస్తున్నారు. టిక్కెట్ల గోల లేకుండా మెట్రో స్మార్ట్‌ కార్డు ‘నెబ్యులా’ను తీసుకొస్తున్నారు. దీని ధర రూ.100, మరో రూ.100తో రీచార్జి చేసుకోవాలి. అంతేకాదు గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డులను ఈనెల మూడో వారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌ విక్రయాలకు త్వరలో వెబ్‌సైట్‌ను ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రారంభించనుంది.

మనం బయలుదేరే స్టేషన్‌ మొదటి అంతస్తులోని ‘ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌’ గేటు వద్ద ఈ కార్డును స్వైప్‌ చేయాలి. రైలు దిగాక స్టేషన్‌లోని ఎగ్జిట్‌ గేటు వద్ద మరోమారు స్వైప్‌ చేస్తే చాలు.. ప్రయాణించిన దూరానికి అయిన చార్జీ కార్డు నుంచే కట్‌ అవుతుంది. భవిష్యత్‌లో ఈ కార్డుతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, క్యాబ్‌లు, మెట్రోమాల్స్, స్టేషన్లలో షాపింగ్‌.. ఇలా 16 రకాల సేవలు పొందే అవకాశముంది. కాగా మెట్రో కనిష్ట టిక్కెట్‌ ధర రూ.10, గరిష్టంగా రూ.50 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement