-
ఒక్క టికెట్.. తీరొక్క జర్నీ
సాక్షి, హైదరాబాద్: ఒక్క టికెట్పై తీరొక్క రవాణా అందుబాటులోకి రానుంది. బస్సు, రైలు, క్యాబ్, ఆటో అన్నింటికీ ఇక ఒకే టిక్కెట్. సమయానికి ఏది అందుబాటులో ఉంటే ఆ వాహనంలో ఎంచక్కా బయలుదేరవచ్చు. ఠంఛన్గా అనుకున్న చోటుకు అనుకున్న సమయానికి చేరుకోవచ్చు. ఈ స్మార్ట్కార్డుతో షాపింగ్ కూడా చేయొచ్చు. వస్తువులు కొనుక్కోవచ్చు. ప్రస్తుతం నోయిడా, నాగ్పూర్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ‘సింగిల్ టికెట్పై మల్టీ ట్రాన్స్పోర్ట్ జర్నీ’త్వరలో నగరంలో అందుబాటులోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్లోని సిటీబస్సు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు ఉబర్, ఓలా క్యాబ్లు, ఆటోల్లో కూడా ఒకే టికెట్పైన ప్రయాణం చేయవచ్చు. ప్రజారవాణాలో ముందడుగుగా భావించే మల్టీట్రాన్స్పోర్టు స్మా ర్ట్ కార్డుపైన సోమవారంఇక్కడి బస్భవన్లో విస్తృత చర్చలు జరిగాయి. ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ నేతృ త్వంలో ఏర్పాటైన టాస్క్పోర్స్ కమిటీలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఈడీ పురుషోత్తమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్లు శర్మ, అల్కా, ఎల్అండ్టీ ప్రతినిధులు అనిల్ సైనీ, రవీందర్రెడ్డి, ఉబర్, ఓలా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీట్రాన్స్పోర్ట్ స్మార్ట్కార్డు వ్యవస్థ పనితీరు, ప్రయోజనాలు తదితర అంశాలపై ఎస్బీఐ అధికారులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నోయిడా, నాగ్పూర్లలో అమలవుతున్న స్మార్టుకార్డుల పనితీరును వివరించారు. ఆ నగరాల్లో కేవలం ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లకు మాత్రమే ఈ సింగిల్ టిక్కెట్ సిస్టమ్ పరిమితం. నగరంలో అన్ని రకాల ప్రజారవాణా సదుపాయాలను ఒక గొడుగు కిందకు తెచ్చేవిధంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ విధానానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, మెటీరియల్ను ఎస్బీఐ అందజేయనుంది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదా యం సైతం ఎస్బీఐ నుంచి ఆయా రవాణా సంస్థలకు వెళ్తుంది. ‘ఓలా, ఉబర్ సంస్థలకు అనుబంధంగా నడుస్తున్న ఆటోరిక్షాలను కూడా దీని పరిధిలోకి తేవడం ద్వారా ప్రజలకు నిరంతరాయ ప్రయాణ సదుపాయం లభిస్తుంది’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇలా పనిచేస్తుంది: సింగిల్ టికెట్ మల్టీ ట్రాన్స్పోర్టు స్మార్ట్కార్డులను స్టేట్బ్యాంకు అన్ని చోట్ల విక్రయిస్తుంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, బస్పాస్ కౌంటర్లు, రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, మెట్రో స్టేషన్లు వంటి అన్ని ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తారు. ప్రయాణికులు మొదట రూ.50 చెల్లించి ఈ కార్డును కొనుగోలు చేయాలి. తరువాత రూ.200 నుంచి రూ.2000 వరకు రీచార్జ్ చేసుకోవచ్చు. తమ అవసరం మేరకు ప్రయాణం చేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాల్లోనే వీటి వినియోగం ఉంటుంది. ఇందుకోసం బస్సులు, రైళ్లు, ఆటోల్లో ప్రత్యేకంగా తయారు చేసిన టిక్కెట్ ఇష్యూ మిషన్లు(టిమ్స్) ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులు బస్సు లేదా రైలు ఎక్కిన వెంటనే స్వైప్ చేయవచ్చు. ఉదాహరణకు ఉప్పల్ నుంచి అమీర్పేట్ వరకు బస్సులో వచ్చిన ప్రయాణికుడు అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మరో చోటుకు క్యాబ్లోగాని, ఆటోలోగాని వెళ్లవచ్చు. లింగంపల్లి నుంచి బేగంపేట వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో వచ్చిన ప్రయాణికులు అక్కడి నుంచి సిటీ బస్సుల్లో వెళ్లవచ్చు. ఇలా తమ అవసరానికి అనుగుణంగా ఎక్కడికంటే అక్కడికి అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఆర్టీసీలో మొదట ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో దీన్ని ప్రవేశపెట్టిన తరువాత అన్ని బస్సుల్లోకి విస్తరిస్తారు. ఈ స్మార్ట్కార్డు వల్ల సిటీ బస్సుల్లో తిరుగుతున్న 33 లక్షల మందికి అలాగే ఎంఎంటీఎస్ రైళ్లలో రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి మెట్రో సేవలను వినియోగించుకుంటున్న మరో 70 వేల మందికిపైగా ప్రయోజనం లభించనుంది. ఈ కార్డును వినియోగించే వారికి తాము పయనించిన దూరం, అందుకోసం చెల్లించిన డబ్బుల వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్కు ఎస్సెమ్మెస్ ద్వారా చేరుతాయి. దీంతో తమ అకౌంట్లో ఇంకా ఎన్ని డబ్బులున్నాయి... ఎంత దూరం ప్రయాణం చేయవచ్చు... అనే అంశంపైన ప్రయాణికులకు అవగాహన కలుగుతుంది. బస్పాస్లకు వర్తింపు... బస్పాస్ వినియోగదారులు కూడా ఈ స్మార్ట్కార్డులను వినియోగించుకోవచ్చు. ఇందుకోసంకార్డులో ఒక ఆప్షన్ ఉంచుతారు. ప్రయాణికులు తమ నెల వారీ సాధారణ పాస్లు, ఎన్జీవో, స్టూడెంట్, తది తర పాస్లను దీనితో అనుసంధానం చేసి పయనించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 నుంచి 7 లక్షల మంది బస్పాస్ వినియోగదారులకు కూడా ఈ సదుపాయం లభించనుంది. ఈ స్మార్ట్ కార్డు ద్వారా లభించే మరో సదుపాయం షాపింగ్. ప్రయాణికులు దీనిని క్రెడిట్, డెబిట్ కార్డుల తరహాలో వినియోగిస్తూ షాపింగ్ చేయవచ్చు. ఒక స్మార్ట్కార్డుతో అనేక రకాల ప్రయోజనాలు లభించే విధంగా రూపొందిస్తున్నారు. -
‘నెబ్యులా’తో మెట్రో రైలు జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మెట్రో రైలు ప్రయాణాన్ని ‘స్మార్ట్’ చేస్తున్నారు. టిక్కెట్ల గోల లేకుండా మెట్రో స్మార్ట్ కార్డు ‘నెబ్యులా’ను తీసుకొస్తున్నారు. దీని ధర రూ.100, మరో రూ.100తో రీచార్జి చేసుకోవాలి. అంతేకాదు గరిష్టంగా రూ.2 వేల వరకు రీచార్జి చేసుకోవచ్చు. ఈ కార్డులను ఈనెల మూడో వారం నుంచి అన్ని మెట్రో స్టేషన్లలో కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ విక్రయాలకు త్వరలో వెబ్సైట్ను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించనుంది. మనం బయలుదేరే స్టేషన్ మొదటి అంతస్తులోని ‘ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్’ గేటు వద్ద ఈ కార్డును స్వైప్ చేయాలి. రైలు దిగాక స్టేషన్లోని ఎగ్జిట్ గేటు వద్ద మరోమారు స్వైప్ చేస్తే చాలు.. ప్రయాణించిన దూరానికి అయిన చార్జీ కార్డు నుంచే కట్ అవుతుంది. భవిష్యత్లో ఈ కార్డుతో ఆర్టీసీ, ఎంఎంటీఎస్, క్యాబ్లు, మెట్రోమాల్స్, స్టేషన్లలో షాపింగ్.. ఇలా 16 రకాల సేవలు పొందే అవకాశముంది. కాగా మెట్రో కనిష్ట టిక్కెట్ ధర రూ.10, గరిష్టంగా రూ.50 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. -
స్మార్ట్ కార్డులో హీరోయిన్ ఫొటో
హొసూరు : తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డులకు బదులుగా అందజేస్తున్న స్మార్ట్కార్డులో కుటుంబ యజమాని ఫొటో బదులుగా హీరోయిన్ ఫొటోను ముద్రించా రు. ఈ సంఘటన సేలం ప్రాంతంలో జరిగింది. సేలం జిల్లా ఓమలూరు తాలూక కామలాపురం గ్రామానికి చెందిన పెరియతంబి భార్య సరోజ (67). వీరికి గత నెలలో రేషన్కార్డుకు బదులుగా స్మార్ట్కార్డు వచ్చిందని, సమీపంలోని రేషన్ దుకాణంలో కార్డును తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో సరోజ రేషన్ దుకాణానికెళ్లి స్మార్ట్ కార్డును తీసుకోగా అందులో సరోజ ఫొటోకు బదులుగా సినీ నటి కాజల్ అగర్వాల్ ఫొటోను ఉంది. -
పింఛన్ పంపిణీకి ఫినో
జిల్లాలో మొత్తం 4,12,111 మంది పింఛన్దారులు ఉండేవారు. దాదాపు ఆరు నెలల నుంచి స్మార్ట్కార్డు విధానాన్ని అమలు చేస్తున్నారు. వేలిముద్రలు సరిపోలకపోవడంతో ఒకేసారి జిల్లా వ్యాప్తంగా 1.42 లక్షల మందికి పింఛన్లు ఆగిపోయాయి. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళుతున్నా.. ప్రతినెలా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. దీనివల్ల అందరికీ పింఛన్లు అందడం లేదు. బాధితులు స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఏజెన్సీ వారిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిళ్లు నెలనెలా మరింత అధికం అవుతుండడంతో పంపిణీ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే యోచనలో ఏజెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. పోస్టాఫీసు ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించింది. గత నెల పింఛన్లే పంపిణీ చేయని వైనం టీడీపీ ప్రభుత్వంలో పింఛన్దారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఉన్న పింఛన్లను తొలగించడంతో పాటు అర్హులకు సైతం ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పింఛన్ల తనిఖీ కమిటీలు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తొలగించాయి. వివిధ కారణాలతో జిల్లాలో దాదాపు 1.20 లక్షల మంది పింఛన్దారులను సస్పెన్స్లో పెట్టారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఐదెకరాల నుంచి పదెకరాలకు మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం నేటికీ వెలువడలేదు. ఆన్లైన్లో నిబంధనలు సడలించకపోవడంతో వేల మంది అనర్హులుగా మారిపోయారు. ‘జన్మభూమి- మా ఊరు’ పుణ్యమాని అక్టోబర్ పింఛన్లు నేటికీ పంపిణీ చేయలేదు. ఇక నవంబర్ పింఛన్లు ఎప్పుడిస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement