నాచారం ప్రాంతంలో తనిఖీలు.. రూ. 3 కోట్లు రికవరీ

Hyderabad GST Officials Search Operations At Nacharam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జీఎస్టీ అధికారులు దూకుడు పెంచారు. షెల్‌ కంపెనీల ద్వారా లబ్ధి పొందుతున్న వ్యాపారుల పని పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం అధికారులు 500 కోట్ల రూపాయల టర్నోవర్‌ ఉన్న ఓ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ వ్యాపార సంస్థ యజమాని ఇంటితో పాటు కంపెనీల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో శంకరంపేట, నాచారం యూనిట్లలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. మూడు డొల్ల కంపెనీల ద్వారా సుమారు 40 కోట్ల రూపాయల మేర ఇన్‌వాయిసెస్‌లు జారీ చేసినట్లు గుర్తించారు.

ఈ నకిలీ ఇన్‌వాయిసెస్‌ల వల్ల ప్రభుత్వానికి రూ. 4 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు అధికారులు. ప్రస్తుతం  సదరు సంస్థ యజమానిని అరెస్ట్‌ చేయడమే కాక రూ. 3 కోట్ల రూపాయలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా మిగతా కోటి రూపాయలు చెల్లించే విధంగా యజమాని నుంచి పూచీకత్తు తీసుకున్నారు. ఇవే కాక ఇతర అనేక రంగాలలో పన్ను ఎగవేతదారుపై జీఎస్టీ అధికారులు దృష్టి సారించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top