నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త | Husband who killed his wife | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త

Apr 30 2015 3:27 AM | Updated on Jul 27 2018 2:18 PM

అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను భర్తే నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు.

 అదనపు కట్నం,
 మనస్పర్థలతో దారుణం

 
గొల్లపల్లి: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడంతో పాటు.. మనస్పర్థలు పెరగడంతో చివరకు భార్యను భర్తే నడిరోడ్డుపై కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం గోవింద్‌పల్లికి చెందిన గుర్రం లక్ష్మి-శంకరయ్య దంపతుల పెద్ద కూతురు మమతను ధర్మపురి మండలం మద్దునూర్‌కు చెందిన సోమ మల్లేశంకు ఇచ్చి 2010 లో వివాహం చేశారు. వీరికి కొడుకు శివ(4), కూతురు సహస్ర(2) ఉన్నారు. వివాహ సమయంలో రూ.5.50 లక్షలకట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు.


మమత పెళ్లి జరిగిన కొద్ది రోజులకే చిన్న కూతురు రజితకు పెళ్లి చేశారు. మమత కన్నా రజితకు ఎక్కువ కట్నం ఇచ్చారని మమత భర్త మల్లేశం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రెండేళ్ల నుంచి వేధించడం మొదలు పెట్టాడు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఏడు నెలల క్రితం వచ్చిన మల్లేశం వరకట్న వేధింపులు మానుకోలేదు. దీంతో మమత తండ్రి వచ్చి కూతురిని, పిల్లలను తీసుకెళ్లాడు. తర్వాత మల్లేశం వెళ్లి కొడుకును బలవంతంగా తీసుకెళ్లాడు. అయితే, మమత నెలరోజుల నుంచి జగిత్యాలలో కుట్టుమిషన్ నేర్చుకుంటోంది. రెండు రోజుల క్రితం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌లో భర్తపై వరకట్నం కేసు పెట్టింది. ఈ క్రమంలో మమతపై ఆగ్రహం పెంచుకున్న మల్లేశం ఆమె కుట్టుమిషన్‌కు వెళ్లే సమయంలో హత్య చేయూలని పథకం వేసుకున్నాడు.

బుధవారం ఉదయం 10 గంటలకు మమత గోవింద్‌పల్లి బస్టాండ్‌కు నడుచుకుంటూ వస్తుండగా నడిరోడ్డుపైనే పదునైన ఆయుధంతో మెడపై నాలుగుసార్లు నరికాడు. దీంతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అడ్డుకునేలోపే మల్లేశం పరారయ్యూడు. మమత తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో మల్లేశంపై  పోలీసులు  కేసు నమో దు చేశారు. కాగా.. మల్లేశం ఆస్తి ఇద్దరు పిల్లలకు చెందేలా చర్యలు తీసుకోవాలని మమత తల్లిదండ్రులు రోడ్డుపై ఆందోళన చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement