నిర్మల్‌లో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

నిర్మల్‌లో ఉద్రిక్తత

Published Mon, Mar 26 2018 2:16 AM

High Tension At Nirmal

నిర్మల్‌/నిర్మల్‌టౌన్‌ : నిర్మల్‌లో ఆదివారం జరిగిన శ్రీరామ రథయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. యాత్ర ముగింపు సమయంలో స్థానిక పెద్దమార్కెట్‌ ప్రాంతంలో ఓ వర్గంవారు తమ ప్రార్థన మందిరంపై మరో వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారంటూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన వందలాది మంది రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ దక్షిణామూర్తి, క్యూఆర్టీ కానిస్టేబుల్‌కు రాళ్లు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు ఎస్‌. వారియర్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సంఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని కోరారు.

Advertisement
Advertisement