దరఖాస్తును తిరస్కరించినప్పుడు ఆయనకెందుకు చెప్పలేదు?  | High Court question to officers in Prabhas Land Issue | Sakshi
Sakshi News home page

దరఖాస్తును తిరస్కరించినప్పుడు ఆయనకెందుకు చెప్పలేదు? 

Jan 3 2019 2:04 AM | Updated on Jan 3 2019 2:04 AM

High Court question to officers in Prabhas Land Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో కొనుగోలు చేసిన భూమి క్రమబద్ధీకరణ దరఖాస్తును తిరస్కరించినప్పుడు, ఆ లిఖితపూర్వక సమాచారాన్ని దరఖాస్తుదారుడైన సినీనటుడు ప్రభాస్‌కు ఎందుకు తెలియచేయలేదని హైకోర్టు బుధవారం సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలో తనకున్న భూమిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అధికారులు ఆ స్థలం ప్రహరీ గేటుకు తాళాలు వేయడాన్ని సవాలు చేస్తూ ప్రభాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. తిరస్కరణ విషయం ప్రభాస్‌కు తెలియచేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement