అమ్ముకున్నవారికీ ‘మద్దతు’ ఇవ్వాలి: వీహెచ్‌ | hanumantha rao Demand Mirchi support price | Sakshi
Sakshi News home page

అమ్ముకున్నవారికీ ‘మద్దతు’ ఇవ్వాలి: వీహెచ్‌

May 5 2017 2:20 AM | Updated on Oct 1 2018 2:09 PM

మిర్చి పంటను ఇప్పటికే 40శాతం దాకా రైతులు అమ్మేసుకున్నారని, వారికీ కేంద్రం అందించే ధర, బోనస్‌ను ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: మిర్చి పంటను ఇప్పటికే 40శాతం దాకా రైతులు అమ్మేసుకున్నారని, వారికీ కేంద్రం అందించే ధర, బోనస్‌ను ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రం కనీసం క్వింటాలు  మిర్చికి రూ.10 వేలు ఇవ్వాల్సిందన్నారు. మిర్చి పంటను కొనుగోలు చేయ లేని అసమర్థత నుంచి, దృష్టి మళ్లించడానికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌పై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేసులను పెట్టిందని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement