సాక్షి, హైదరాబాద్: పన్నెండు నెలలు.. 13 వేల పైచిలుకు పాస్ట్పోర్టుల జారీ.. హన్మకొండ తపాలా కార్యాలయం సాధించిన రికార్డు ఇదీ. పోస్టాఫీసులో పాస్పోర్టులకు అనూహ్య స్పందన రావడం కేంద్రం దృష్టిని ఆకర్షించింది. దీంతో రాష్ట్రంలోని పూర్వపు జిల్లా కేంద్రాలన్నింటిలోని తపాలా కార్యాలయాల్లో పాస్పోర్టుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 4 లోపు మిగతా చోట్ల ప్రారంభించేందుకు పచ్చజెండా ఊపటంతో తెలంగాణ తపాలా సర్కిల్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది.
ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా..
పాస్పోర్టులు స్థానికంగానే జారీ చేసేందుకు కేంద్రం తపాలా కార్యాలయాల్లో అనుబంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా గత మార్చిలో హన్మకొండ ప్రధాన తపాలా కార్యాలయంలో పాస్పోర్టుల జారీని ప్రారంభించింది. తదుపరి మహబూబ్నగర్ పోస్టాఫీసులోనూ మొదలుపెట్టింది. ఈ 2 చోట్లా పాస్పోర్టుల కోసం జనం ఎగబడటంతో ఇది విజయవంతమైంది. హైదరాబాద్లో ప్రధాన పాస్పోర్టు కేంద్రంతోపాటు మరికొన్ని సేవా కేంద్రాలు ఉన్నందున ఇక్కడ పోస్టాఫీసులకు అనుమతి ఇవ్వలేదు. కరీంనగర్, నిజామాబాద్లో టీసీఎస్ సాయంతో పాస్పోర్టు విభాగమే కేంద్రాలను ఏర్పాటు చేసినందున మిగతా జిల్లాల్లోని తపాలా కార్యాలయాల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
పక్షం రోజుల్లో ఇంటికి పాస్పోర్ట్
పూర్వపు వరంగల్ జిల్లా పరిధి మొత్తానికి హన్మకొండ పోస్టాఫీసును కేంద్రంగా మార్చిలో ఏర్పా టు చేశారు. తొలి నెలలో 120 పాస్పోర్టులే జారీ అయ్యాయి. ఏప్రిల్లో 784 పాస్పోర్టులు జారీ చేసింది. ఆ తర్వాత ఇది రెట్టింపైంది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండటం.. అరగంటలోనే పూర్తవుతుండటంతో పోస్టాఫీసులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రక్రియ పూర్తయి న çపక్షం రోజుల్లో ఇంటికి పాస్పోర్టు వస్తోంది.
మహబూబ్నగర్లోనూ సక్సెస్..
మహబూబ్నగర్ పట్టణంలోని పోస్టాఫీసులో నిత్యం సగటున 40 పాస్పోర్టుల వెరిఫికేషన్ జరుగుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 4 వేల పాస్పోర్టులు జారీ అయినట్టు అక్కడి తపాలా సూపరింటెండెంట్ శ్రీహరి పేర్కొన్నారు. దీన్ని మహబూబ్నగర్ కొత్త జిల్లా పరిధికే పరిమితం చేయడంతో.. పూర్వపు జిల్లా పరిధి మొత్తానికి విస్తరించాలని ప్రతిపాదనలు పంపినట్టు ఆయన వెల్లడించారు. ఖమ్మం, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండల్లో మార్చి 3 లోపు పాస్పోర్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తపాలాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
విద్యార్థులు వినియోగించుకుంటున్నారు
ఇంటి వద్ద ఉండే పాస్పోర్టు పొందిన అనుభూతిని దరఖాస్తుదారులు పొందుతున్నారు. విద్యార్థులు దీనిని బాగా వినియోగించుకుంటున్నా రు. గతంతో పోలిస్తే పాస్పోర్టు కేంద్రాల ఏర్పాటు తర్వాత తపాలా సేవలను వినియోగించుకుంటున్నవారి సంఖ్య పెరిగింది.
–హన్మకొండ సూపరింటెండెంట్ ఎం.శేషగిరి
ఒక్క ఏడాది.. 13 వేల పాస్పోర్టులు..!
Published Wed, Feb 21 2018 2:46 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement