కోణార్క్ ఎక్స్ప్రెస్లో మరోసారి గంజాయి పట్టుబడింది.
కోణార్క్లో మరోసారి గంజాయి
Aug 28 2017 4:12 PM | Updated on Sep 12 2017 1:12 AM
వరంగల్ అర్బన్: కోణార్క్ ఎక్స్ప్రెస్లో మరోసారి గంజాయి పట్టుబడింది. రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుండి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో 82 కేజీల గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Advertisement


